Showing posts with label smart farming. Show all posts
Showing posts with label smart farming. Show all posts

Thursday, July 9, 2020

వరి సాగుగురించి పూర్తి సమాచారం

వరిలో దొడ్డురకాలు

మీ దిగుబడిని ప్రభావితం చేసే ముఖ్యమైన వరి తెగులు/చీడపీడల ఏమిటి?

వరి పంట చక్రం యొక్క వివిధ దశలలో మీ పంటలపై దాడి చేసే దిగుబడి మరియు వరి నాణ్యత నుండి 5 ముఖ్యమైన తెగుళ్ళు ఉన్నాయి. మీ ప్రయత్నాలకు ఉత్తమమైన రాబడిని నిర్ధారించడానికి ప్రతి తెగులును ఒక నిర్దిష్ట పద్ధతిలో నిర్వహించాలి.

వరి పంట దశలు మరియు ప్రతి దశకు సంబంధించిన తెగులు/చీడపీడల యొక్క సమాచారం ఇక్కడ ఉంది. ప్రతి తెగులు/చీడపీడలు, వాటి ప్రభావం మరియు ఉత్తమ నిర్వహణ విధానం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.


               మొదటిదశ 1

బలమైన పునాదిని ఎలా ఏర్పాటు చేయాలి?

పంట జీవిత చక్రం యొక్క ప్రారంభ దశలో వరి తెగులు నిర్వహణ గురించి మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు ఇక్కడ ఉన్నాయి.

వరి నారుమడి తయారీ

1) నాణ్యమైన విత్తనాలు తీసుకోవాలి

2) నేలను సూక్ష జీవరాహితము చేసుకోవాలి

3) విత్తనాలను నీటిలో ఉంచి తీసి  మొలకలు వచ్చేలా చెయ్యాలి.

4) అప్పటికే సిద్ధం చేసిన నారుమడి ప్రాంతంలో ఈ విత్తనాల్ని చల్లలి

5) పక్షుల నుండి రక్షణ కల్పించాలి

6) నేల స్వభావాన్ని బట్టి ఎరువులు అందించాలి

7)  21 నుండి 29 రోజుల్లో నాటు కోవడం మంచిది.


కలుపు నివారణకు



కలుపు మొక్కలు ఎందుకు పెద్ద ముప్పు?

కలుపు మొక్కలు ప్రమాదకరం ఎందుకంటే పోషకాలు, నీరు మరియు సూర్యరశ్మి వంటి విలువైన వనరుల కోసం అవి మీ పంటతో పోటీపడతాయి, కాబట్టి మొత్తం ఉత్పత్తి నాణ్యతను ప్రభావితం చేస్తాయి. వచ్చే ప్రధాన వ్యాధులు వచ్చే నష్టాలు మరియు నివారణ చర్యలు తెలుసుకుందాం.

సరైన కలుపు మొక్కల నిర్వహణ రెండు ముఖ్యమైన కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది, తరచుగా రైతులు పట్టించుకోరు, ఇది పంట నష్టం మరియు ఉత్పాదకతకు ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది


1) అజోళ్ళను పెంచడం వాళ్ళ కాలుపును నివారించి నత్రజని స్థాపన చెయ్యొచ్చు.

2) మార్కెట్లో చాలా రకాల గడ్డి నివారణ మందులు అందుబాటులో ఉంటాయి.



వరి పంటకు వచ్చే  ప్రధాన వ్యాధులు


1) కాండాం తొలుచు పురుగు

* కాండం తొలిచే పురుగు మీ పంటకు ఎందుకు ప్రమాదం?

* కాండం తొలుచు పురుగు ప్రమాదకరమైనది.

 * ఎందుకంటే ఇది పంట యొక్క ప్రారంభ దశలో కనిపిస్తుంది, ఇది మొత్తం పంట నాణ్యత మరియు దిగుబడిని ప్రభావితం చేస్తుంది. 

* దిగుబడి నష్టాలు 20% నుండి 70% వరకు మారవచ్చు. 

* వరి మొక్కలు ఈ కాండం తొలుచు పురుగుకి ప్రారంభ దశ నుండి పుష్పించే దశ వరకు ఎక్కువగా గురి అవుతాయి.

కాండం తొలిచే పురుగును ఎలా గుర్తించాలి?

కాండం తొలుచు పురుగులు వారి గోధుమ రంగు గుడ్లను చాలా వరకు ఆకు ఉపరితలంపై 15-80 ద్రవ్యరాశిలో వదిలివేస్తాయి.


* చిన్న లార్వా ఒక పట్టు దారం మీద ఆకుల నుండి తమను తాము నిలిపివేసి, ఇతర మొక్కలకు తిండి కోసం ఎగిరిపోతుంది. 

*పరిణతి చెందిన లార్వా మొక్క యొక్క కోశం మరియు మొదలలో ప్రభావితం చూపిస్తాయి.

కాండం తొలుచు పురుగును ఎలా నివారించుకోవాలి?

కాండం తొలుచు పురుగు ఆశించిన మొదటి వారం తరువాత నష్టం జరుగుతుంది, కానీ అప్పుడు నష్టాన్ని నియంత్రించడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఆ కారణంగా, పురుగు ఆశించకముందు మీరు చర్య తీసుకోవాలి. వీలైనంత త్వరగా నాట్లు వేసుకోవాలి,ఆలస్యంగా వేయడం వలన దిగుబడి మీద ప్రభావితం చూపెడుతుంది.కాండం తొలుచు పురుడు నివారణకు పురుగు మందు పిచికారి చేసుకోవాలి.


" వెల్ & ,దండ" కాండం తొలుచు పురుగుల‌పై అద్భుతమైన మరియు దీర్ఘకాలిక నియంత్రణను అందిస్తుంది.


              సుడిదోమ

సుడిదోమ వరి పంటలో ప్రధానమైనది. 

ఇది వరి మొక్కలకు ఆకుల నుండి సారం పీల్చడం ద్వారా నష్టం కలిగిస్తుంది, తరువాత పసుపు రంగులోకి మారుతుంది.


వరి లో హాప్పర్ బర్న్

వరి పంటలు ఎండిపోయి, పొలంలో పసుపు నుండి గోధుమ రంగు ప్యాచ్ ఏర్పడతాయి - వరిలో హాప్పర్ బర్న్(ఎండిపోవడం) అని పిలుస్తారు. 

సుడిదోమ అధిక తేమ, వాంఛనీయ ఉష్ణోగ్రత, అధిక స్థాయిలో నత్రజని ఉపయోగించడం మరియు గాలి లేని పరిస్థితులలో వృద్ధి చెందుతుంది.

సుడిదోమను ఎలా నియంత్రించాలి?

విత్తే దశలో మీ వరి పంట నిర్వహణ పద్ధతులను ప్రారంభించండి.

సుడిదోమ యొక్క నియంత్రణ చర్యలలో ఒకటి మీరు సుడిదోమను గమనించిన వెంటనే మీ సీడ్‌బెడ్‌లను నీటితో నింపడం. 

అయినప్పటికీ, నీరు పెట్టడం ఒక ఎంపిక కాకపోతే మరియు సుడిదోమ ఉధృతి వారి సహజ శత్రువులను మించిపోతున్నాయని మీరు తేల్చిచెప్పినట్లయితే, మీరు వాటిని వదిలించుకోవడానికి మరియు నష్టాన్ని నివారించడానికి  సాఫ్ట్ & ప్రభ పురుగు మందులను ఉపయోగించాలి.

రైతుల సంస్థ 

చార్వి ఇన్నోవేషన్స్  వారి సైట్ లో దొరుకును

www.chaarviinnovations.com



 పాముపొడ తెగులు 

వరి పంటలను ఎలా ప్రభావితం చేస్తుంది?

పాముపొడ తెగులు మొక్కల పెరుగుదలకు అంతరాయం కలిగిస్తుంది. ఇది మొక్క యొక్క కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది మరియు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఇది దిగుబడి తగ్గింపుతో పాటు, పోటాకుకు కూడా ఒత్తిడిని కలిగిస్తుంది, ఇది తక్కువ పరాగసంపర్కానికి దారితీస్తుంది.

పాముపొడ తెగులు వరి ఆకులను నాశనం చేయడం ద్వారా వరి ఉత్పాదకత మరియు ధాన్యం నాణ్యతలో తీవ్రమైన నష్టాలకు దారితీస్తుంది, దిగుబడి 50% వరకు తగ్గుతుంది.

వరి కోశం ముడత

కోశ ముడత తెగులును ఎలా నిర్వహించాలి?

పాముపొడ తెగులు కేవలం 21 రోజుల తక్కువ జీవిత చక్రం ఉన్నందున దానిని నిర్వహించడం మరియు నియంత్రణలో ఉంచడం చాలా కష్టం. పాముపొడ తెగుల నివారణకు మొక్కను

ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యమైన విషయం.

పాముపొడ తెగులను నివారించడానికి ఉత్తమమైన విధానం నమ్మకమైన శిలీంద్ర సంహారిణిని ఉపయోగించడం.

          www.chaarviinnovations.com

కాటుక తెగుళ్లు మసి కంకి యొక్క ప్రభావం ఏమిటి

కాటుక తెగుళ్లు సాధారణంగా పంట చివరి భాగంలో కనిపిస్తుంది. దీని వల్ల పొట్టు, గింజ లేదా రెండింటి యొక్క రంగు పాలిపోవడానికి కారణమవుతుంది.

బియ్యం నిర్వహణకాటుక తెగుళ్లు/మసి కంకిని ఎలా నిర్వహించాలి?

మీ ధాన్యానికి ఎక్కువ మెరుపుని ఇవ్వండి. సరైన సమయంలో మీ వరి పొలాలకు చికిత్స చేయండి మరియు అధిక దిగుబడి, మెరిసే నాణ్యమైన ధాన్యాలతో బలమైన ముగింపుని ఇవ్వండి .

సమర్థవంతమైన శిలీంద్ర సంహారిణి యొక్క పూర్వ మరియు పంటకోత తర్వాత ఉపయోగించడంతో ధాన్యం రంగు పాలిపోవడాన్ని నివారించవచ్చు.

మెడ విరుపు తెగులు


అగ్గి తెగులు


మన పంటలకు అవసరం అయిన అన్ని రకాల పురుగు మందులు www.chaarviinnovations.com లో లభించును


అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 

https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

1)టార్పాలిన్స్ 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

Friday, June 26, 2020

వ్యవసాయ రంగంలో కి యువతరం.. సరికొత్త ప్రయోగానికి సిద్ధమై శుభపరిణామము

కొత్త రకం తోట.. కోటి రొక్కం పంట

డ్రాగన్‌ ఫ్రూట్‌, బ్రెజిల్‌ మోసంబి, 
    బర్షి కర్జ్జూర, థాయ్‌సెవన్‌ జామ 

30 ఎకరాల్లో రకరకాల పంటలు..  
     ఏడాదికి కోటి రూపాయల రాబడి

పంటలు పండుతున్నాయి కానీ గిట్టుబాటు కావడం లేదు.. డిమాండ్‌ ఉన్నది కానీ పంటలు లేవు.. ఈ విషయం ఓ యువరైతు ఆలోచనను పూర్తిగా మార్చేసింది. 

సంప్రదాయసాగుకు స్వస్తిచెప్పి.. కొత్తరకం పంటల వైపు మళ్లించింది. నిర్మల్‌ జిల్లా బాసరకు చెందిన యువరైతు సందీప్‌ తనకున్న 30 ఎకరాల్లో డ్రాగన్‌ఫ్రూట్‌, బ్రెజిల్‌ మోసంబి, బర్షి కర్జూర, థాయ్‌సెవన్‌ జామ తోటలను సాగుచేస్తూ ఏడాదికి కోటికిపైగా  ఆదాయం సంపాదిస్తున్నారు. 

బాసర: వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్‌, మినుము, పెసర, పసుపు తదితర పంటల పేర్లు తరుచూ వింటున్నాం. తెలంగాణ నేలల్లో వాటినే సాగుచేస్తున్నాం. నిర్మల్‌ జిల్లాలో ఓ యువరైతు మాత్రం డ్రాగన్‌ఫ్రూట్‌, బ్రెజిల్‌ మోసంబి, థాయ్‌సెవన్‌ జామ వంటి కొత్తకొత్త రకాలను సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. బాసరకు చెందిన సందీప్‌ అనే రైతు 30 ఎకరాల్లో వీటిద్వారా ఏడాదికి కోటి రూపాయలకు పైగా ఆదాయం పొందుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల రైతులు సందీప్‌ వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించి.. వాటి సాగు వివరాలను తెలుసుకుంటున్నారు. కాప్టాస్‌ కుటుంబానికి చెందిన డ్రాగన్‌ మొక్కపేరు పిథాయా. దీని శాస్త్రీయనామం ఐలోసరస్‌ అండడాస్‌. మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికాలో ఎక్కువగా పండుతుంది. ఇటీవలకాలంలో చైనాతోపాటు పలు ఆసియాదేశాల్లోనూ సాగు చేస్తున్నారు. 

రాళ్లు రప్పలతోకూడి, తడి త్వరగా ఆరిపోయే నేలలు, 20 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే నేలలు ఈ పంటకు అనుకూలం. అనేక రకాల పోషక విలువలు ఉండే డ్రాగన్‌ ఫ్రూట్‌కు వాణిజ్యపరంగా మంచి డిమాండ్‌ ఉన్నది. ప్రతి ఐదుఅడుగులకు ఒక స్తంభాన్ని ఏర్పాటుచేసి, దాని మొదట్లో మొక్కలను నాటుతారు. రెండేండ్లకు మొక్క పుష్పిస్తుంది. పువ్వు రాలిన నెలకు కాయ పక్వానికి వస్తుంది. పండు లోపల తెల్లగా ఉండి గుజ్జు, ముదురు గులాబీ రంగులో రెండురకాల ఫలాలు ఉంటాయి. ముదురు గులాబీ రంగు పండు నాణ్యమైనది. సాగులో చీడపీడల బాధ పెద్దగా ఉండదు. బిందుసేద్యం ద్వారా సాగు చేయవచ్చు. మొదటిసారిపంట రెండేండ్లలో కోతకు వస్తుంది. తర్వాతి ఏడాది నుంచి నాలుగు నెలలపాటు పూలు, కాయ వస్తుంది. మార్కెట్లో కిలో ధర రూ.350కు పైగా పలుకుతుంది. దీనిని మొదటిసారి సాగుచేయడానికి ఎకరానికి రూ.5లక్షల పెట్టుబడి అవసరం. ఎకరానికి సుమారు 6 టన్నుల దిగుబడి వస్తుంది. డ్రాగన్‌ ఫ్రూట్‌ను ఐదెకరాల్లో సాగుచేసి ఎకరానికి 12 లక్షలకుపైగా ఆదాయం పొందుతున్నట్టు యువరైతు సందీప్‌ చెప్తున్నారు.

నల్లరేగడి నేలల్లో కర్జ్జూర సాగు
------------------------------------------
బ్రిటన్‌లోని సోమర్‌సెట్‌కు చెందిన డేట్‌ఫామ్స్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ సృష్టించిన రకం బర్షి కర్జ్జూర. ఒక్కో కర్జూర మొక్కకు రూ.6వేలు అవుతుంది. ఎకరంలో వీటిని 60 వరకు నాటవచ్చు. ఒక్కోచెట్టు దాదాపు 70 కిలోల దిగుబడి ఇస్తుంది. మార్కెట్‌లో కిలో రూ. 150 పలుకుతుంది. నాణ్యమైన కర్జూరకు ఇంకా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎడారి నేలల్లో పెరిగే కర్జ్జూర మొక్కలు బాసరలోని నల్లరేగడి నేలలోనూ పెరుగుతున్నాయి. మొక్కలు నాటిన మూడేండ్లలో గెల వేయడం మొదలవుతుంది. వీటిసాగుకు నీటి అవసరం తక్కువ. ఒక్క పెండపురుగు ఆశించడంతప్ప ఇతర చీడ, పీడల బాధ ఉండదు. మగ, ఆడ చెట్లు రెండురకాల నాటితేనే కాత వస్తుంది. సందీప్‌ నాలుగు ఎకరాల్లో దీనిని సాగుచేయగా.. చెట్లు గెలలు వేస్తున్నాయి. 

థాయ్‌సెవన్‌ జామ
----------------------------------
పంట వేసిన ఎనిమిది నెలల్లోనే థాయ్‌సెవన్‌ జామ దిగుబడి మొదలవుతుంది. మొక్కలు వేయడానికి ఎకరానికి దాదాపు రూ.30 వేలు ఖర్చవుతుంది. నాలుగు టన్నులకు పైగా దిగుబడి వస్తుండటంతో కిలో రూ.80 పలికినా రూ.3లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. యువరైతు సందీప్‌ ఈ పంటను ఎనిమిది ఎకరాల్లో సాగుచేస్తున్నారు.

తియ్యని పంట బ్రెజిల్‌ మోసంబి
----------------------------------
మహారాష్ట్రలో సాగవుతున్న బ్రెజిల్‌ మోసంబిని పరిశీలించిన సందీప్‌ 11 ఎకరాల్లో దీనిని సాగుచేస్తున్నారు. దీనిసాగుకు ఎకరాకు రూ. 70 వేల ఖర్చవగా.. 6 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ మోసంబి మార్కెట్‌లో కిలో రూ.100కు పైగా ధర పలుకుతుంది. వీటి అమ్మకానికి యువరైతు మహారాష్ట్రలోని జైన్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మోసంబిని జైన్‌ కంపెనీవారు పల్పీఆరెంజ్‌ జ్యూస్‌ను తయారుచేయడానికి వినియోగిస్తారు. తీయదనం ఎక్కువగా ఉంటుండంతో చక్కెరను కలుపకపోయినా చాలా రుచిగా ఉంటుంది.

విభిన్న పంటలే మేలు
---------------------------------
సాధారణ పంటలు వాణిజ్యపరంగా అంతగా లాభాలు తీసుకురావడం లేదు. మద్దతు ధర తక్కువగా ఉండటంతో తక్కువ ఆదాయం వస్తున్నది. దీంతో డిమాండ్‌ అధికంగా ఉన్న పంటలను ఆలోచించి సాగు చేస్తున్నాను. సాగుచేయడానికి అనుకూలంగా భూమి ఉండటం, మార్కెట్‌లో అధిక ధర పలుకుతుండటంతో వీటిసాగుపై దృష్టి సారించా. ముందుగా కోల్‌కతా, గుజరాత్‌, మహారాష్ట్ర, కాకినాడ తదితర ప్రాంతాలకు వెళ్లి అక్కడి తోటలను పరిశీలించాను. ఏడాదికి దాదాపు రూ. కోటికిపైనే సంపాదిస్తున్నాను. ప్రభుత్వం డ్రిప్‌ ఇరిగేషన్‌కు సబ్సిడీ ఇచ్చింది. వ్యవసాయాధికారులు పంటల సాగును పరిశీలించి మార్కెటింగ్‌, ఇతర సౌకర్యాలు అందించేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. రైతులు పెద్దఎత్తున మా వ్యవసాయక్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. 

-సందీప్‌, యువ రైతు, బాసర

Thursday, June 25, 2020

విపత్తు లోను ఉపాధి అవకాశాల్ని సృష్టించుకుంటున్నా నేటి అన్నదాతలు 👌👌💐

అరటితో అద్బుతలు..



లాక్​డౌన్_వేళ_ఓ_రైతు_అద్భుతమే_సృష్టించాడు. 

కర్ణాటకలో తాను సాగు చేసిన అరటిపండ్లు అమ్ముడుపోలేదని చెత్తకుప్పలో_పారేయకుండా.. వాటిని శ్రద్ధగా ఎండబెట్టాడు. అరటి పండ్లను పోషకాలు నిండిన డ్రైఫ్రూట్​గా మార్చేసి లాభాలు ఆర్జిస్తున్నాడు.

డ్రైఫ్రూట్స్​ ఆరోగ్యానికి_ఎంత_మేలు_చేస్తాయో_వైద్యులు చెబుతూనే ఉంటారు. అయితే ఇన్నాళ్లు... ఎండు ద్రాక్షా.. ఎండిన అప్రికాట్​.. ఎండబెట్టిన_అంజీరా.. కాజూ,బాదం.. ఇలా డ్రైఫ్రూట్స్​లో చాలా రకాలే తిని ఉంటాం. కానీ, ఇప్పుడు మన దేశంలో ఉత్పత్తవుతున్న ఎండు అరటిపండును ఈ జాబితాలోకి చేర్చేశాడు #కర్ణాటకకు_చెందిన_ఓ_రైతు.

కష్టం నుంచి ఆలోచన!
బళ్లారి, కంపిలి తాలూకా, రామసాగర గ్రామానికి చెందిన K.గంగాధర్​ ఓ_సాధారణ_రైతు. లాక్​డౌన్ వేళ సుగంధి రకం అరటిని సాగు చేశాడు గంగాధర్​. కానీ, కరోనా కారణంగా మార్కెట్​ పడిపోయి గిట్టుబాటు ధర రాలేదు. దీంతో పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడ్డాడు​.

కానీ, మనిషి_తలచుకుంటే_ఎంతటి_విపత్తులోనైనా ఓ మార్గాన్ని వెతకొచ్చని గుర్తించాడు. వెంటనే, అరటిపళ్లు #పాడవ్వకుండా వాటిని ఏం చేయొచ్చని ఆలోచించాడు.
విదేశాల్లో ఎండు అరటిపండ్లకున్న డిమాండ్​ గురించి తెలుసుకున్నాడు గంగాధర్. 

భారత్​లో తనలాంటి_రైతులను_సంప్రదించాడు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో.. నెల రోజులకు పైగా అరటి పండ్లను ఎండబెట్టి ఓ డబ్బాలో ప్యాక్​ చేసి జిల్లాలోని హోల్​సేస్​, రిటైల్​ దుకాణాలకు విక్రయించి లాభాలు పొందుతున్నాడు.
ఎండబెట్టిన అరటిపండ్లలో పోషకాలు_పుష్కలంగా ఉంటాయని.. 

ఈ డ్రైఫ్రూట్​ను తింటే ఆరోగ్యానికెన్నో లాభాలున్నాయని రాయ్​చూర్​ వ్యవసాయ వర్సిటీ ధ్రువీకరించింది. దీంతో ప్రభుత్వం సహకరిస్తే... ఈ డ్రై_బనానా ఉత్పత్తిని మరింత 
వృద్ధి చేస్తానంటున్నాడు గంగాధర్​.

రైతు చిరునామా
 బళ్లారి జిల్లా, 
కంపిలి తాలూకా, 
రామసాగర గ్రామానికి చెందిన
 K.గంగాధర్​ 
Cell: 9986328071

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...